Friday, April 19, 2024

ముంబై ఏర్‌పోర్ట్‌లో 24 కోట్ల హెరాయిన్‌ స్వాధీనం..

దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌ నుంచి ముంబయికి వచ్చిన ఒక వ్యక్తినుంచి రూ.24 కోట్ల విలువైన 3.98 కిలోల హెరాయిన్‌ను మాదకద్రవ్య నియంత్రణ సంస్థ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారంనాడు ఎర్రని బ్యాగ్‌లో హెరాయిన్‌ తరలిస్తూండగా అధికారులు అడ్డుకున్నామని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లగేజ్‌ బ్యాగ్‌లోని ఒక అరలో నాలుగు ప్యాకెట్లలో హెరాయిన్‌ను తీసుకొస్తూండగా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గతంలో దక్షిణాఫ్రికానుంచి వచ్చిన ఒక మహిళనుంచి కూడా ఇలాగే 3.9 కిలోల హెరాయిన్‌ను స్వాధీన చేసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement