Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 2226 కరోనా కేసులు.. 65 మంది మృతి

దేశవ్యాప్తంగా ఇవ్వాల‌ కొత్తగా 2,226 మంది కరోనా బారిన‌ప‌డ్డారు. దీంతో మొత్తం కేసులు 4,31,36,371కి చేరాయి. ఇందులో 4,25,97,003 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,413 మంది కరోనాకు బలవగా, 14,955 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 2,202 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 65 మంది చ‌నిపోయిన‌ట్టు అధికారులు తెలిపారు.

కాగా, మొత్తం కరోనా కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు 1,92,28,66,524 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఇందులో శనివారం ఒకేరోజు 14,37,381 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement