Thursday, April 25, 2024

విశాఖలో 22 కిలోల గంజాయి పట్టివేత..

అక్రమ గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖలో 22 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. వీరు బీటెక్‌ చదువుతున్న సమద్‌, ఇర్ఫాన్‌, వంశీకృష్ణలుగా పోలీసులు గుర్తించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ కేసులు ఎంతమంది హస్తం ఉందనే విషయమైన పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement