Saturday, April 20, 2024

తెలంగాణలో కొత్తగా 2157 కరోనా కేసులు – మృతులు ఎంత మందో తెలుసా ?

తెలంగాణలో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక తాజాగా గడచిన 24 గంటల్లో మొత్తం 72,364 కరోనా టెస్టులు నిర్వహించగా 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇందులో 3,07,499 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ప్రస్తుతం 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

మరోవైపు గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1780కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement