Saturday, April 13, 2024

ఎంఎస్సీ నర్సింగ్‌, కన్వీనర్‌ కోటాసీట్లకు 21న వెబ్‌ కౌన్సెలింగ్‌.. అభ్యర్ధుల మెరిట్‌ జాబితా విడుదల

వరంగల్‌ ప్రభన్యూస్‌, ప్రతినిధి: ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ సీట్ల భర్తీకి కాను ఇవ్వాల, రేపు (20, 21వ తేదిల్లో) మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్‌ఆప్షన్లకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇవ్వాల (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి రేపు (బుధవారం) సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు కళాశాలలవారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్‌ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ WWW.KNRUHS.TELANGANA.GOV.IN ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement