Friday, April 19, 2024

ఏపీలో కొత్తగా 2068 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,641 సాంపిల్స్ ని పరీక్షించగా 2,068 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల ప్రకాశం లో ఆరుగురు, కృష్ణ లో నలుగురు, చిత్తూర్ లో ముగ్గురు, గుంటూరు లో ముగ్గురు, నెల్లూరు లో ఇద్దరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం మరియు విజయనగరం లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

గడచిన 24 గంటల్లో 2,127 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు నేటి వరకు రాష్ట్రంలో 2,44,84,051 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…1929565
మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…1964117
మొత్తం మృతుల సంఖ్య…13354
యాక్టీవ్ కేసుల సంఖ్య…21198

Advertisement

తాజా వార్తలు

Advertisement