Friday, March 29, 2024

ఒకే రోజు పిడుగుపాటుకు 20 మంది బలి!!

పిడుగుపాటుకు ఒకే రోజు ఏకంగా 20 మంది మృతి చెందిన ఘటన పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకుంది. దక్షిణ బెంగాల్ లోని కోల్ కత్తా తో పాటు పలు జిల్లాల్లో భారీగా ఉరుములు మెరుపులతో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. అయితే పిడుగుపాటుకు ముర్షిదాబాద్ లో 9 మంది మృతి చెందారు. అలాగే హుబ్లీ లో మరో తొమ్మిది మంది మృతి చెందారు. ఇక మిడ్నాపూర్ జిల్లాలో మరో ఇద్దరు పిడుగుపాటుకు బలయ్యారు.

ఇలా ఒకే రోజు మొత్తం 20 మంది మృతి చెందారు. కాగా మృతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. అలాగే మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా కూడా చెల్లించనున్నట్లు నరేంద్ర మోడీ కార్యాలయం ప్రకటించారు.అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికీ యాభై వేలు చొప్పున చెల్లించనున్నట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement