Friday, March 29, 2024

20 లక్షల ఉద్యోగాలు, ఉమ్మడి పౌరస్మృతి.. గుజరాత్‌ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల

గుజరాత్‌ అసెంబ్లి ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, సిఎం భూపేంద్ర పటేల్‌, రాష్ట్ర బిజెపి చీఫ్‌ సిఆర్‌ పాటిల్‌ తదితరులు మేనిఫెస్టోను ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడం, విద్యార్థినులందరికీ ఉచిత విద్య, రాడికలైజేషన్‌ వ్యతిరేక సెల్‌ ఏర్పాటు చేయడం వంటి హామీలను ప్రజల ముందుంచింది. బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ, ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఉగ్రవాద సంస్థలు, భారత వ్యతిరేక శక్తుల స్లీపర్‌ సెల్‌లు, సంభావ్య బెదిరింపులను గుర్తించి, నిర్మూలించడానికి యాంటీ రాడికలైజేషన్‌ సెల్‌ను రూపొందిస్తామని చెప్పారు. అదేవిధంగా గుజరాత్‌ యూనిఫాం సివిల్‌ కోడ్‌ కమిటీ సిఫార్సును పూర్తిగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ”ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చట్టాన్ని కూడా రూపొందిస్తాము. ప్రజా ఆస్తులను పాడుచేసే, ప్రైవేట్‌ ఆస్తులపై దాడి చేసే సంఘ వ్యతిరేక శక్తుల నుండి రికవరీకి సంబంధించిన చట్టం ఉంటుంది.

గుజరాత్‌ పురోగతి కోసం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాము. రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడం ద్వారా 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా మారింది అనిచెప్పారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ మాట్లాడుతూ, ”ఈరోజు మా సంకల్ప్‌ పత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉంది. రెండు దశాబ్దాలుగా బిజెపి ప్రజల ప్రేమను పొందింది. ఇది కేవలం బూటకపు వాగ్దానాలే కాదు, ప్రధాని మోడీ రూపొందించిన అభివృద్ధి రోడ్‌ మ్యాప్‌కు మా నిబద్ధత. మేము దేనికి మాత్రమే కట్టుబడి ఉన్నాము. హామీలన్నీ నెరవేర్చి చూపిస్తాం అని అన్నారు.

బీజేపీ మేనిఫెస్టోలోని కీలక హామీలు..

  • రైతు మౌలిక సదుపాయాలకు రూ.10,000 కోట్లు
  • సంఘ విద్రోహశక్తుల అణచివేతకు యాంటీ-రాడికలైజేషన్‌ సెల్‌ ఏర్పాటు
  • రానున్న ఐదేళ్లలో గుజరాత్‌ యువతకు 20 లక్షల ఉద్యోగావకాశాలు
  • మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
  • మహిళా సీనియర్‌ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం
  • కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థినులందరికీ ఉచిత
  • గుజరాత్‌ను 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం
  • నీటిపారుదల సౌకర్యాల కోసం రూ.25,000 కోట్లు
  • దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్రలో రెండు సీఫుడ్‌ పార్కులు
  • మొదటి నీలి ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక కారిడార్‌
  • ఫిషింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తీవ్ర దృష్టి
  • రూ. 110 కోట్ల కార్పస్‌తో ఉచిత డయాగ్నోస్టిక్‌ పథకం
  • రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కి.మీ మేర పరిక్రమ మార్గం
  • దేవభూమి ద్వారకా కారిడార్‌ నిర్మాణం
  • ఆలయాల పునరుద్ధరణ, విస్తరణ, ప్రచారానికి రూ.1,000 కోట్లు
Advertisement

తాజా వార్తలు

Advertisement