Wednesday, April 24, 2024

ఏపీలో కొత్తగా 1843 కేసులు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన గడిచిన 24 గంటల్లో మొత్తం 70,727 కరోనా పరీక్షలు చేయగా… 1843 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య రాష్ట్రంలో 19,48,592 కి చేరింది. అలాగే ప్రస్తుతం 23,571 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 2199 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,11,812 కు చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనా తో 12 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 13,209కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement