Saturday, April 20, 2024

చైనాలో ఘోరం.. 18 మంది సజీవ దహనం!

చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం మార్షల్ ఆర్ట్స్ కేంద్రంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు 18 మందిని బలితీసుకున్నాయి. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌, షాంగ్‌కియు నగరంలోని ఝెచెంగ్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, అగ్ని ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందగా, 16 మంది గాయపడ్డారని ప్రభుత్వ సిజిటిఎన్-టివి వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement