Saturday, April 20, 2024

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావే : మంత్రి రోజా

తిరుపతి సిటీ, మే 19 (ప్రభ న్యూస్) : అమరావతి భూములను నిరుపేదలకు అందించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. శుక్రవారం ఆమె ఎస్వీ యూనివర్సిటీ శ్రీనివాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సేవా వందన కార్యక్రమం అనంతరం ఆమె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సీపీకి 175 స్థానాలు గెలుచుకుని తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారని వివరించారు. వాల్ ఇంటర్ వ్యవస్థలో సరికొత్త మార్పును తీసుకుని వచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నిరుపేదలకు ఇచ్చే స్థానాలను సమాధులతో పోల్చడం ఏమిటని తెలిపారు. నిరుపేదల జీవితాలు బాగుపడటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. అమరావతి భూములను నిరుపేదలకు అందించడానికి చంద్రబాబు రాజకీయం చేయడం ఆయన దిగజారుడు రాజకీయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement