Saturday, April 20, 2024

తెలంగాణలో త్వరలో 1,654 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను తీసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1654 మంది గెస్ట్ లెక్చరర్లను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో పని చేసిన వారినే రెన్యూవల్ చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు ఆలోచన చేస్తోంది. గతంలో పనిచేసిన వారు ఒక వేళ అందుబాటులో లేకుంటే కొత్త వారిని ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవాలని సంబంధిత కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేయనుంది. ఈ 1654 మంది గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీ పై మరో రెండు లేదా మూడు రోజుల్లో ఇంటర్‌ బోర్డు క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యకం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement