Wednesday, April 24, 2024

శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ నోట్లు

తిరుమల శ్రీవారి హుండీలో మన దేశ కరెన్సీనే కాకుండా పలు దేశాలకు చెందిన కరెన్సీ వచ్చి చేరుతోంది. విదేశీ భక్తులు వారి కరెన్సీని హుండీలో వేస్తున్నారు. ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉండగా… శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. విదేశీ కరెన్సీ విషయానికి వస్తే మలేషియా కరెన్సీ నోట్లు అత్యధికంగా 46 శాతం వచ్చాయి.

మలేషియా కరెన్సీ తర్వాతి స్థానంలో అమెరికా డాలర్లు ఉన్నాయి. శ్రీవారి హుండీలో అమెరికా డాలర్లు 16 శాతం వచ్చాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే స్వామి వారికి వచ్చిన విదేశీ కరెన్సీలో పాకిస్థాన్ నోట్లు కూడా ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలో శ్రీవారికి రూ. 27.49 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఈ ఏడాది వీదేశీ నోట్లు తగ్గే అవకాశం ఉంది.

ఈ వార్త కూడా చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు

Advertisement

తాజా వార్తలు

Advertisement