Friday, March 29, 2024

Breaking | పేకాట ఆడుతూ పట్టుబడ్డ పొలిటికల్​ లీడర్లు, బిల్డర్లు.. అరెస్టు చేసిన రాచకొండ స్పెషల్ టీమ్​

హైదరాబాద్​లోని మేడిపల్లిలో పేకాట (జూదం) ఆడుతున్న 15 మంది లీడర్లు, డిప్యూటీ మేయర్‌, ఆరుగురు కార్పొరేటర్లను రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం అరెస్టు చేసింది. పేకాట ఆడుతున్న సమాచారం అందుకున్న పోలీసులు పీర్జాదిగూడ మున్సిపల్‌ కో-ఆప్ట్‌ సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి కార్యాలయంపై దాడి చేశారు.

దీంతో డిప్యూటీ మేయర్‌ కె. శివకుమార్‌ గౌడ్‌, ఆరుగురు కార్పొరేటర్లు మూడు కార్డులు (జూదం) ఆడుతున్న విషయాన్ని గుర్తించారు. ఇందులో మరో ఆరుగురు బిల్డర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా నగదు, ప్లే కార్డులు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే.. వారిని విడిచిపెట్టాలని పోలీసులపై పలువురు నేతలు ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ వార్త వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement