Friday, March 29, 2024

14శాతం పెరిగిన విద్యుత్‌ వినియోగం.. బలమైన ఆర్థిక వృద్ధికి సంకేతం

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశ విద్యుత్‌ వినియోగం నవంబర్‌ 2022లో 13.6 శాతం రెండంకెల వృద్ధితో 112.81 బిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. విద్యుత్‌ వినియోగం బలమైన పెరుగుదల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుంది, ఉత్తర భారతంలో హటింగ్‌ ఉపకరణాల వినియోగం, రబీ పంటల సీజన్‌ ప్రారంభం కావడంతో ఆర్థిక కార్యకలాపాలు మరింత మెరుగుపడటం వల్ల రానున్న నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ మరింతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రైతులు కొత్త పంటలకు నీటిపారుదల కోసం గొట్టపు బావులను నడపడానికి విద్యుత్తును ఉపయోగిస్తారు. గత ఏడాది నవంబర్‌లో, విద్యుత్‌ వినియోగం 99.32 బిలియన్‌ యూనిట్లు, 2020 అదే నెలలో 96.88 బి.యూ. కంటే ఎక్కువ.

ఒక రోజులో అత్యధిక సరఫరా అయిన గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ గత నెలలో 186.89 గిగావాట్లకు పెరిగింది. గరిష్ట విద్యుత్‌ సరఫరా నవంబర్‌ 2021లో 166.10 గి.వా., నవంబర్‌ 2020లో 160.77 గి.వా. ఉంది. నవంబర్‌ 2019లో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 155.32 గి.వాట్లు మాత్రే. నవంబర్‌లో విద్యుత్‌ వినియోగంలో బలమైన వృద్ధి స్థిరమైన రికవరీని సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలు మరింత మెరుగయ్యే దృష్ట్యా రాబోయే నెలల్లో విద్యుత్‌ వినియోగంతో పాటు డిమాండ్‌ కూడా అధిక వృద్ధిని సాధిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement