Thursday, April 25, 2024

అవయవ దానం చేసి ఐదుగురి ప్రాణాలు కాపాడిన 13 ఏళ్ల బాలుడు

13 ఏళ్ల బాలుడు అవయవ దానం చేయడం ఐదుగురు ప్రాణాలను కాపాడింది. భద్రాచలం పరిధి కొత్తకాలనీ అశోక్‌నగర్‌కు చెందిన కొయ్యల సిద్దార్థ (13)కు ఈ నెల 17న అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, వాంతులు వచ్చాయి. అతడిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర వైద్యం అందించినప్పటికీ బాలుడి పరిస్థితి మెరుగుపడలేదు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. దాదాపు 48 గంటల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మార్పు రాలేదు.

అయితే బాలుడికి‘హైపెక్స్‌ బ్రెయిన్‌ ఇన్‌జురీ’ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 21న బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. జీవన్‌దాన్‌ సభ్యులు అవయవదానంపై తల్లి సీతకు అవగాహన కల్పించడంతో ఆమె అంగీకరించారు. దీంతో బాలుడి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలు సేకరించి ప్రాణాపాయంలో ఉన్న ఐదుగురికి అమర్చి వారి ప్రాణాలను కాపాడారు.

ఈ వార్త కూడా చదవండి: ఇకపై పదో తరగతిలో రెండు సార్లు పరీక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement