Friday, April 19, 2024

ఏపీలో 13 మంది ఐపీఎస్‌ల బదిలీ, పోస్టింగులు

ఏపీలో 13 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా షీముషి, ప.గో. జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయ ప్రవీణ్, ప్రకాశం జిల్లా ఎస్పీగా మలికా గార్గ్, ఏపీఎస్పీ విజయనగరం 5వ బెటాలియన్ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా అమ్మిరెడ్డి, విజయవాడ రైల్వేస్ ఎస్పీగా రాహుల్ దేవ్, మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్‌గా అజితా వేజేండ్ల, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌గా సుమిత్ సునీల్, విశాఖ డీసీపీ-1గా గౌతమి శాలి, సీఎం ఎస్‌జీ ఇంటెలిజెన్స్ ఎస్పీగా వకుల్ జిందాల్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కాగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని నారాయణ్ నాయక్‌‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఈ వార్త కూడా చదవండి: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

Advertisement

తాజా వార్తలు

Advertisement