Thursday, April 25, 2024

ప‌ట్టాలు త‌ప్పిన 13ఖాళీ వ్యాగ‌న్లు.. త‌ప్పిన ప్ర‌మాదం

గూడ్స్ రైలులోని 13 ఖాళీ వ్యాగన్లు పట్టాలు త‌ప్పాయి..ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎటువంటి గాయాలు కాలేదు.. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలోని న్యూ కర్వాండియా మరియు న్యూ సోనానగర్ రైల్వే స్టేషన్‌ల మధ్య ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌లో గూడ్స్ రైలు పదమూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ రోజు ఉదయం ట్రాక్‌లను తొలగించి అప్‌లైన్ ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
పట్టాలు తప్ప‌డానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement