Saturday, April 20, 2024

ఇదేమన్న ఆటోనా.. పుష్పక విమానమా? ఒక్క ఆటోలో 27మంది ప్రయాణికులు

ఒకటి, రెండు, మూడు, నాలుగు.. ఇట్లా లెక్క కొనసాగుతూనే ఉంది.. అయినా ఆ ఆటోలో నుంచి మనుషులు దిగుతూనే ఉన్నారు. ఒక్క ఆటోలో 27 మంది ప్రయాణికులు కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇది నిజం.. ఉత్తరప్రదేశ్​లోని ఫతేపూర్​ జిల్లా బింద్కీ కొత్వాలి ప్రాంతాలో ఓ ఆటో ఓవర్​ లోడ్​తో అతి వేగంగా వెళ్లడం పోలీసులు గమనించారు. ఆటో స్పీడ్​ ఓవర్​ స్పీడ్​తో వెళ్తున్నట్టు స్పీడ్​ గన్​ గమనించిన పోలీసులు ఆటోనే చేజ్​ చేసి ఆపేశారు.

ఆటోని ఆపి అందులో నుంచి ప్రయాణికులను దింపుతుంటే.. వృద్ధులు, పిల్లలతో సహా 27 మంది బయటికి రావడంతో పోలీసులు ఆశ్యర్యపోయారు. పోలీసులు ప్రయాణికులను ఒక్కొక్కరుగా లెక్కిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఆటోను సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement