Thursday, April 25, 2024

ఇండియా లో కొత్తగా 1,20,306 కరోనా కేసులు…ఇదే ఫస్ట్ టైం

దేశంలో ప్రతిరోజు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 1,20,306 కేసులు నమోదు అయ్యాయి. అలాగే మ‌రో 3357మంది కరోనా కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు కొత్త‌గా గడిచిన 24 గంటల్లో 1,97,348మంది మహమ్మారి నుంచి కొలుకున్నారు.గడిచిన 58 రోజుల్లో అతి తక్కువ కేసులు నమోదు కావటం ఇదే మొదటి సారి.

అలాగే దేశంలో రిక‌వ‌రీ రేటు 93.38కి పెరిగింది. రోజువారి పాజిటివిటీ రేటు 5.78 గా నమోదు అయింది. కాగా తాజా గణాంకాల ప్రకారం దేశంలో ప్ర‌స్తుతం 15,55,248యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement