Saturday, April 20, 2024

మంచిర్యాల: సైకిల్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

తల్లిదండ్రులు సైకిల్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం సూరారం గ్రామానికి చెందిన పారండ్ల మధు (12) ఏడో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా తనకు సైకిల్ కొనివ్వమని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. అయితే తల్లిదండ్రులు కరోనా కారణంగా తమ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తర్వాత కొనిస్తామని చెప్పారు.

కానీ బాలుడు మాత్రం తల్లిదండ్రుల మాట వినలేదు. చుట్టుపక్కల పిల్లలందరూ సైకిల్ తొక్కుతున్నారని, తనకూ సైకిల్ కావాలని మారం చేశాడు. దీంతో గురువారం ఉదయం కుమారుడిని మందలించి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. కానీ సాయంత్రం వాళ్లు వచ్చేసరికి కుమారుడు ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించాడు. తండ్రి రామస్వామి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ బీజేపీ నేతపై హత్యాయత్నం

Advertisement

తాజా వార్తలు

Advertisement