Friday, April 19, 2024

ఒకే హాస్టల్ లో 11 మంది విద్యార్థులకు కరోనా!

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు స్కూళ్లు, హాస్టల్ లలో కరోనా నమోదు అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలోని విద్యాసంస్థల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. . ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గోకవరం మండలం కృష్ణునిపాలెం సాంఘీక సంక్షేమ శాఖ జూనియర్ కళాశాలలో 11 మంది విద్యార్థులను కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. హాస్టల్ లో మొత్తం 34 మంది విద్యార్థులు ఉన్నారు. 11 మంది విద్యార్థులు వివిధ కళాశాలల్లో చదువుతున్నారు. హోస్టల్ లోనే ఐసోలేషన్ ఏర్పాటు చేశారు వైద్య సిద్బంది. అయితే, మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించకుండానే హాస్టల్ వార్డెన్ ఎన్నికల డ్యూటీకి  వెళ్లిపోయాడు.

కాగా, ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలోని ఓ కళాశాలలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కళాశాలలో మొత్తం 163 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.   

Advertisement

తాజా వార్తలు

Advertisement