Friday, March 29, 2024

హైదరాబాద్ : రెండో టెస్టులోనైనా మెరుగైన ఆటతీరు : లక్ష్మణ్

ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఘోరంగా పరాజయం పాలైన భారత్ రెండో టెస్టులోనైనా మెరుగైన ఆటతీరు కనబరచాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్లులో సీనియర్ బ్యాట్స్ మన్ అయిన రోహిత్ శర్మ, అజింక్యా రహానేల ఆట తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం రెండో టెస్టులోనైనా వారిద్దరూ మెరుగ్గా ఆడాలని సూచించారు. ఫుట్ వర్క్ లేకుండా బంతిని ఆడేందుకు ప్రయత్నించడం వల్లే వారిరువురూ ఔటయ్యారని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement