Friday, March 29, 2024

హైదరాబాద్ : ఎల్లుండి యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‌ ఈ నెల 4న యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ప్రధానాలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్‌ తుదిమెరుగుల పనులను వీక్షించనున్నారు. ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌, డిపోలను నిర్మించనున్న స్థలాలను కూడా ఆయన పరిశీలిస్తారు.  ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ సమీక్షించి, నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement