Friday, March 29, 2024

శ్రీనగర్ : పుల్వామా దాడి రెండేళ్లయిన సందర్భంగా ఉగ్రదాడులకు కుట్ర : జమ్మూఐజీ

పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లయ్యిాంది. దానిని పురస్కరించుకుని మరో ఉగ్రదాడికి ముష్కరులు కుట్రపన్నారన్న పక్కా సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ఐజీ ముఖేష్ సింగ్ స్వయంగా చెప్పారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన నిన్న రాత్రి సొహైల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 6 నుంచి ఆరున్నర కిలోల బరువున్న ఐఈడీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం, భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొన్నారు. నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులు భారీ దాడికి కుట్ర పన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement