Friday, April 19, 2024

వరుడు కావలెను చేసినందుకు గర్వపడుతున్నా-నాగశౌర్య

సితార ఎంటర్‌-టైన్‌మెంట్‌ నాగశౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచ యం చేస్తూ తెరకెక్కించిన చిత్రం వరుడు కావలెను. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం -టైలర్‌ను ముఖ్య అతిథిగా హాజరైన రానా దగ్గుబాటి విడుదల చేశారు. అనంతరం… రానా దగ్గుబాటి మాట్లాడుతూ ఃఃఈ సినిమాతో నాగశౌర్య ఈజ్‌ బ్యాక్‌ అని చెప్పగలను. ఈరోజు ఇక్కడికి గెస్ట్‌లా రాలేదు. మా భీవ్లూ నాయక్‌ నిర్మాత కోసం వచ్చాను.ఃః అని అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ సౌజన్య చెప్పిన లైన్‌ నచ్చి వెంటనే ఓకే చేశా. కథ వినగానే సూపర్‌హిట్‌ అని ఫిక్స్‌ అయ్యా. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా ఈ సినిమా ఉంటు-ంది. గణష్‌ రావూరి చక్కని సంభా షణలు రాశారు. నేను ఇంత అందంగా కనిపించ డానికి కారణం మా డిఓపీ వంశీ పచ్చిపులుసు. ఆయన కెమెరా పనితనానికి నాతో నేనే లవ్‌లో పడిపోయా. విశాల్‌ చంద్రశేఖర్‌ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజన్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. ఈ సినిమాతో సౌజన్య అక్క కల నెరవేరబోతోంది. రీతు చాలా అద్భుతంగా యాక్ట్‌ చేసింది. మంచి కథతో ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నాఃః అని అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ఃఃఇది ఫ్యామిలీ, కమర్షియల్‌ సినిమా. ద్వితీయార్థంలో
ఒక సస్పెన్స్‌ ఉంది. అది యూత్‌కి బాగా ఆకట్టుకుంటుందిఃః అని అన్నారు.
మాటల రచయిత గణష్‌ రావూరి మాట్లాడుతూ…భూమిలాంటి అమ్మాయిని ఇంప్రెస్‌ చేయాలంటే ఆకాష్‌లాంటి అబ్బాయి కావాలి.
ఈ చిత్రంలో మా హీరోహీరోయిన్ల పాత్రలు
అంత ప్లజెంట్‌గా ఉంటాయి. ఫన్‌, ఎమోషన్స్‌, అద్భుతమైన సంగీతం అన్ని ఉన్న చిత్రమిది ఃః అని అన్నారు. దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, గీత రచయిత రాంబాబు గోశాల, సప్తగిరి, సంగీత దర్శకుడు
విశాల్‌ చంద్రశేఖర్‌ తదితరులు సినిమా గురించి మాట్లాడారు. ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌, నిర్మాత: సూర్య దేవర నాగవంశీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement