Friday, March 29, 2024

వరంగల్ :కేసీఆర్ కు జన్మదిన కానుకగా మొక్కల పెంపకం : మంత్రి ఎర్రబెల్లి

  కోటి వృక్షార్చనతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి ఎరర్రబెల్లి దయాకర్‌ రావు పిలుపునిచ్చారు. మొక్కలు నాటి సిఎం కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. ఇది మన సమాజాన్ని పచ్చగా ఉంచుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇకపోతే తెలంగాణలో అభివృద్ది సంక్షేమ కార్యక్రామల అమల్లో సిఎం కెసిఆర్‌ దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుందన్నారు. భూములకు సంబంధించి ఏవైనా ఇబ్బందులుండి  పంట పెట్టుబడి రాని రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి కూడా పంట పెట్టుబడి అందిస్తామని చెప్పారు రైతులకు పంట పెట్టుబడి ఇచ్చే ఈ రైతుబంధు పథకం ఇక నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement