Saturday, April 20, 2024

లాయర్ దంపతుల హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్

పెద్దపల్లి జిల్లాలో గత నెల 17న జరిగిన లాయర్ దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నలుగురు నిందితుల్లో కుంట శ్రీను, కుమార్, చిరంజీవి అనే ముగ్గురిని పోలీసులు మంథని తీసుకెళ్లి హత్యకు ముందు రెక్కీ చేసిన ప్రాంతాల్లో రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ మేరకు మంథని కోర్టు ప్రాంగణం, పూలే విగ్రహం, అంబేద్కర్ చౌక్‌, పాత పెట్రోల్ బంక్ నుంచి కల్వచర్ల వరకు రెక్కీ నిర్వహించిన ప్రాంతాలను పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం నిందితుల పోలీసులు హత్య జరిగిన కల్వచర్లకు తీసుకెళ్లారు. కాగా ఇటీవల నిందితులు హత్య కోసం వాడిన కత్తులు, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితులు వరంగల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement