Saturday, April 20, 2024

రేపు ఖమ్మం జిల్లా గంగదేవిపాడులో షర్మిల నిరాహార దీక్ష

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఈ నెల 20న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేత కొండా రాఘవరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈనెల 20వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగిస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలపాలని కోరారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో మూతపడ్డ 1,036 ప్రైవేట్ స్కూళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement