Thursday, April 18, 2024

రాష్ట్రంలో వింత వాతావరణం.. తెలంగాణలో మళ్లీ నాలుగు రోజులు వర్షాలు

ఈ సారి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు పెరుగుతూ ఉండగా మరోవైపు వర్షాలు పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గురు – శుక్రవారాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో, శని – ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపింది.

అదే సమయంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. నిన్న (బుధవారం) నిజామాబాద్, నిర్మల్, నాగర్కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ లోని జక్రాన్ పల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని జిల్లాల్లో ఎండ 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement