Friday, April 26, 2024

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో భారత్ కథ కంచికి

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బోపన్న జోడీ నిష్క్రమణతో భారత్‌ కథ ముగిసింది. ఇప్పటికే పురుషుల, మహిళల డబుల్స్‌లో దివిజ్‌, అంకిత ఓటమిపాలయ్యారు. తాజాగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బోపన్న జోడీ తొలి రౌండులోనే నిష్క్రమించిం ది.రోహన్‌ బోపన్న…చైనాకు చెందిన యింగింగ్‌ డ్యువాన్‌ జోడీ అమెరికా-యూకే జంట బెథాని మాటెక్‌ సాండ్స్‌, జేమీ ముర్రే చేతిలో 4-6, 4-6 తేడాతో వరస సెట్లలో పరాజయం పాలైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌ ఒక గంట మూడునిమిషాల్లో ముగిసింది. అంతకుముందు బోపన్న-జపాన్‌కు చెందిన బెన్‌ మెక్లచ్లాన్‌ జోడీ 4-6, 6-7 (0)తేడాతో కొరియన్‌ వైల్డ్‌కార్డు జోడీ జి సుంగ్‌ నామ్‌, మిన్‌ క్యు చేతిలో తొలిరౌండులో పరాజయం పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement