Friday, March 29, 2024

మెదక్ : జగ్గారెడ్డిది ఉనికి రాజకీయం : పద్మా దేవేందర్ రెడ్డి

  ఉమ్మడి ఎపిలో తెలంగాణలో అన్నివర్గాలకు అన్యాయమే జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.  మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి ఎన్నో కొత్త పథకాలను తెచ్చిన కేసీఆర్‌ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారన్నారు. ఇంటింటికి మంచినీరు, నిరంతర కరెంట్‌, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కెసిఆర్‌ ఘనత అన్నారు. ఉనికి కోసమే కాంగ్రెస్నేత జగ్గారెడ్డి సిఎం కెసిఆర్‌పై విమర్శలు చేస్తున్నారని పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు.  ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంత నాయకులకు వంత పాడుతూ జగ్గారెడ్డి తెలంగాణకు ద్రోహం చేసిన విషయం ప్రజలు ఇంకా మరచిపోలేదని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement