Friday, March 29, 2024

భార్య‌, కుమార్తెను ర‌క్షించుకునేందుకు చిరుత‌తో వీరోచిత పోరు

కర్ణాటక రాష్ట్రం లో భార్య, కుమార్తెను కాపాడు కునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుతపులితో తలపడి దాన్ని చంపేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తెతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న రాజ్‌గోపాల్‌ నాయక్‌పై పులి ఒక్కసారిగా దూకింది. ఈ క్రమంలో ముగ్గురు బైకు మీద నుంచి కిందపడిపోయారు. వెంటనే చిరుతపులి వారిపై దాడి చేసింది. భార్య‌, కుమార్తె చిరుత దాడిలో గాయ‌ప‌డ‌టం చూసిన గోపాల్ వెంట‌నే చిరుత‌పై ఎదురుదాడికి దిగాడు…ఎటువంటి ఆయుధం లేకుండాల‌నే ధైర్యంగా చిరుత‌తో వీరోచిత పోరాటం చేశాడు.. చివరికి దాన్ని హతమార్చి తన‌తో పాటు భార్య‌, కుమార్తె ప్రాణాలను కాపాడాడు. అప్పటికే పులి దాడిలో తీవ్రంగా గాయపడిన అతని భార్య, కుమార్తెతో సహా రాజ్‌గోపాల్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అత‌ని ధైర్యానికి అంద‌రూ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement