Wednesday, April 17, 2024

ప్రియుడు గౌరంగ్ దోషి చేతిలో.. చిత్ర హింసల‌కు గుర‌యిన‌ న‌టి ఆశాషైనీ

హీరోయిన్ ఆశాషైనీ త‌న బాయ్ ఫ్రెండ్ చేతిలో చిత్ర హింస‌ల‌కు గుర‌యిన‌ట్లు తెలిపింది.గాయాలపాలైన తన ఫోటోలు విడుదల చేశారు. ఇటీవల ఆనాటి భయానక పరిస్థితులు గుర్తు చేసుకున్నారు. అతని చేతిలో తాను ఎంతటి నరకం అనుభవించారో చెప్పి బాధపడింది. చండీఘర్ కి చెందిన ఆషా షైనీ అసలు పేరు ఫ్లోరా షైనీ. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆషా షైనీ 1999లో విడుదలైన ప్రేమ కోసం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. వినీత్ ఆ చిత్రంలో హీరోగా నటించారు. ఆషా షైనీ నటించిన ఫస్ట్ హిట్ మూవీ మనసున్న మారాజు. రాజశేఖర్ హీరోగా విడుదలైన ఈ చిత్రంలో ఆషా షైనీ ఒక హీరోయిన్ గా చేశారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కాగా… బాలకృష్ణ మరదలు పాత్ర చేశారు.

బాలయ్య-ఆషా షైనీ పై చిత్రీకరించిన లక్స్ పాప సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్. సౌత్ ఇండియాలో పలు చిత్రాలు చేసిన ఆషా షైనీ… 2014 నుండి వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేశారు. అక్కడ ఆమె ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆషా షైనీ కనిపించిన చివరి చిత్రం 34 ఫార్మ్ హౌస్. కాగా ఆషా షైనీ ప్రియుడు గౌరంగ్ దోషి చేతిలో చిత్ర హింసలు అనుభవించారట. అతడు తనను తీవ్రంగా కొట్టేవాడట. గౌరంగ్ జోషి దెబ్బలకు ఒకసారి తన దవడ విరిగిపోయిందట. కనికరం లేకుండా తన్నేవాడట. ఒకరోజు తనకి భయపడి ఒంటిపై బట్టలు ఉన్నాయ్యో లేవో కూడా చూసుకోకుండా బయటకు పరుగెత్తిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ దారుణ సంఘటనలు ఆషా షైనీ బయటపెట్టారు. 2007లో ఈ సంఘటన జరినట్లు 2018లో ఆశా షైనీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement