Tuesday, April 23, 2024

ప్యాంటేసిన ఏనుగు

సోషల్‌ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఇప్పుడు మరో ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ప్యాంటు, షర్టు వేసుకున్న ఓ ఏనుగు ఫోటోను ఆనంద్‌ మహీంద్రా పోస్టు చేశారు. దానిపై ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ఎలీ-ప్యాంట్‌ అని రాసుకొచ్చారు. ఏనుగు పర్ఫుల్‌ కలర్‌ షర్ట్‌, వైట్‌ కలర్‌ ప్యాంటు ధరించింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు దీనిపై కామెంట్లు చెస్తున్నారు. ఏనుగు పద్దతిగా డ్రెస్స్‌ చేసుకుని రోడ్డుపై నడుస్తోందని ఒకరు కామెంట్‌ చేయగా మరోకరేమో ఏనుగు ట్రెండ్‌ ఫాలో అవుతందని రీట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement