Friday, April 19, 2024

న్యూఢిల్లీ : మోడీ తీరుపై సొంత పార్టీలోనే రాజుకుంటున్న అసంతృప్తి

ప్రధాని మోడీ తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి రాజుకుంటోంది. ఆయన మాటలు ఘనం చేతులు మాత్రం అంతంత మాత్రమేనన్న విమర్శలు పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలోనూ ఆయన రాజకీయ లబ్ధి వినా జనం కష్టాలపై దృష్టి పెట్టలేదన్న భావన వ్యక్తమౌతున్నది. కరోనా విపత్కర పరిస్థితుల్లో పరిస్థితులను చక్కదిద్దడానికి ఆయన తీసుకున్న చర్యలు జనబాహుల్యానికి ఇసుమంతైనా ఊరట కలిగించలేదని ఆయనను అభిమానించే వారు సైతం అంగీకరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, అగ్రి చట్టాలు వంటి చర్యలపై విపక్షాలే కాదు, స్వపక్షీయుల నుంచి కూడా ప్రధాని విమర్శలను ఎదుర్కొన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ అయితే బహిరంగంగానే ప్రభుత్వ తీరు పట్ల ఆయన తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement