Thursday, April 25, 2024

న్యూఢిల్లీ : పెట్రో ధరలు పైపైకి…హైదరాబాద్ లో రూ.93.10కి చేరిన లీటర్ పెట్రోలు ధర

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశంలో పెట్రో ధరలు వరుసగా 9వ రోజు కూడా పెరిగింది. ఈ రోజు పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరు ధర 89.54కు చేరింది. అలాగే డీజిల్ లీటర్ ధర 79.95కు పెరిగింది. ఇక తెలంగాణ రాజథాని హైదరాబాద్ లో అయితే లీటర్ పెట్రోలు ధర రూ. 93.10లకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ. 87.20లకి పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.96కు చేరింది. అక్కడ డీజిల్ ధర లీటర్ కు 86.98కి  చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement