Friday, April 19, 2024

నిరుద్యోగులకు ‘సోనూసూద్’ ఎలక్ట్రిక్ రిక్షాలు

ఎనిమిది మంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు అందించారు హీరో సోనూసూద్. తన స్వస్థలమైన పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు (ఈ-రిక్షా) అందించారు. ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, ఫలితంగా కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. సాయం చేయగలిగే స్థితిలో ఉండే ప్రతి ఒక్కరు అవసరమైన వారికి తోచినంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. తనకు సేవాగుణం అలవడడానికి తన తల్లిదండ్రులే కారణమన్నాడు. అవసరమైన వారికి సాయం చేస్తూ అందరిలానే తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు సోనూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement