Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 39,097 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మొత్తం 39,097 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.అలాగే మరోవైపు గడిచిన 24 గంటల్లో 35,087మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే నిన్న ఒక్క రోజే 546 మంది మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159కి చేరింది. అలాగే డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3,05,03,166కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,08,977 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా తో మొత్తం 4,20,016 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement