తెలంగాణలో కరోనా ఉధృతి మెల్లిమెల్లిగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన బాధితుల్లో 453 మంది బాధితలు కోలుకున్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,384 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 6,54,989 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,44,747 మంది కోలుకున్నారు. మొత్తం మరణాలు 3,858కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదినలో వెల్లడించింది. ఇవాళ మొత్తం 46,987 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: