Thursday, April 25, 2024

తెలంగాణకు మరో కంపెనీ.. రూ.1400కోట్ల పెట్టుబడి ప్రకటించిన హ్యూందాయ్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకొస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి రాబట్టారు. తెలంగాణ‌లో రూ.1,400 కోట్ల పెట్టుబ‌డిని పెట్ట‌నున్న‌ట్లు ద‌క్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యుందాయ్ ప్ర‌కటించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నూత‌నంగా ఏర్పాటు చేయ‌నున్న మొబిలిటీ క్ల‌స్ట‌ర్‌లో ఈ పెట్టుబ‌డుల‌ను పెట్ట‌నున్న‌ట్లు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎకన‌మిక్ ఫోరం స‌ద‌స్సులో భాగంగా తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో హ్యుందాయ్ రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందంపై సంత‌కాలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement