Saturday, April 20, 2024

తప్పుదోవ పట్టించే వారితో జాగ్రత్త : బొత్స

తప్పు దోవ పట్టించే వారితో జగ్రత్తగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ వలంటీర్లను హెచ్చరించారు. వలంటీర్ అంటే ఉద్యోగం కాదు సేవ అంటూ జగన్ రాసిన లేఖతో అపోహలు తొలగిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు. వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చేది జీతం కాదు, గౌరవ భృతి మాత్రమేనని బొత్స ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడు వలంటీర్లుగా చేస్తున్న వారు ముందు ముందు ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు వస్తే వెళ్లిపోవచ్చని అన్నారు. అటువంటి మెరుగైన ఉద్యోగం లభించే వరకూ సేవాదృక్ఫథంతో పని చేస్తారన్నదే ప్రభుత్వ ఉద్దేశమని బొత్స చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement