Friday, April 19, 2024

టీమిండియాకు షాక్.. టీ-20 సిరీస్‌కు ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం

ఇంగ్లండ్‌తో టీ-20 సిరీస్ ప్రారంభం కాక ముందే టీమిండియాకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. బీసీసీఐ తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలం కావడంతో నటరాజన్, రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి తుదిజట్టులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. గత సీజన్ ఐపీఎల్‌లో అంచనాలకు మించి రాణించడంతో వీరు సెలక్టర్ల దృష్టిలో పడటంతో ఇంగ్లండ్‌తో ఐదు టీ-20ల సిరీస్‌కు ఎంపికయ్యారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లు వీరి పరిస్థితి తయారైంది. నటరాజన్ ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ఆడి రాణించాడు. అయితే వరుణ్ చక్రవర్తికి మాత్రం వరుసగా రెండో అవకాశం కూడా చేజారినట్లవుతుంది. రాహుల్ తెవాటియా కూడా తుది జట్టులో స్థానం కోసం చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ వీరి ఫిట్‌నెస్ వీరి అవకాశాలను దెబ్బతీసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement