Thursday, April 25, 2024

చెన్నై : రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 54/1

ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా  చెన్నై వేదికగా  జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేసిన భారత్ ఇంగ్లాండ్ ను 134 పరుగులకే ఆలౌట్ చేసి 195 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఫస్టిన్నింగ్స్ సెంచరీ హీరో రోహిత్ శర్మ పాతిక పరుగులతోనూ, ఛటేశ్వర్ పుజారా 7 పరుగులతోనూ క్రిజ్ లో ఉన్నారు. ఇప్పిటికే భారత్ ఓవరాల్ ఆధిక్యత 249 పరుగులు. తొలి రోజు నుంచే స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఇంగ్లాండ్ ఛేదన చాలా కష్టం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement