Wednesday, April 24, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఆంధ్రప్రభ ఎండీ

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ జన్మదినం సందర్బంగా శుక్రవారం హైదరాబాద్ లోని ఆంధ్రప్రభ ప్రధాన కార్యాలయంలో మొక్క నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ కృషి అభినందనీయం, వారి స్ఫూర్తితో మా ప్రతి శాఖల్లో మొక్కలు విరివిగా నాటుతున్నాం. ఇంకా ప్రతి ఉద్యోగి విధిగా ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నాటి మన ఆరోగ్యంతో పాటు వాటిని ఆరోగ్యంగా ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement