Friday, March 29, 2024

గొర్రెల మంద, ఆవు దూడపై చిరుత దాడి..

నాగూర్ కర్నూల్ జిల్లాలో చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. ఉప్పునుంతల సమీపంలోని ఓ గొర్రెల మంద పై దాడిచేసిన చిరుత ఆపై ఆవు దూడపై పంజా విసిరింది. సోమవారం తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. చిరుత దాడిలో ఎనిమిది గొర్రెలు, ఓ ఆవు దూడ మృతి చెందాయి. గుర్తించిన మంద యజమాని పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించారు. చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. చిరుతను వీలైనంత తొందరగా పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో స్పా సెలూన్ పేరుతో వ్యభిచారం దందా.. 23 మంది అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement