Tuesday, April 23, 2024

గేటెడ్ కమ్యూనిటీల్లో విజృంభిస్తున్న కరోనా

హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. మదీనాగూడలోని మైహోమ్ జువెల్ కమ్యూనిటీలో ఏకంగా 125 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అటు కేపీహెచ్‌బీలోని ఇందూ టౌన్‌షిప్‌లోనూ 30కి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఈ రెండే కాకుండా నగరంలోని అనేక పెద్ద కమ్యూనిటీల్లో కరోనా వైరస్ కేసులు బాగా వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తున్నా వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లి వస్తుండటంతో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కమ్యూనిటీల్లో నివసించే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ వాడటం లాంటి చర్యలు తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement