Wednesday, March 27, 2024

కుంభమేళాపై గందరగోళం.. సాధువుల ఆగ్రహం

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను ముగిస్తున్నట్టు ‘నిరంజని అఖాడా’ ప్రకటించడం వివాదాస్పదమైంది. కుంభమేళాను ముగిస్తున్నట్టు ప్రకటించే అధికారం నిరంజని అఖాడాకు ఎక్కడిదని మిగతా అఖాడాలకు చెందిన సాధువులు మండిపడుతున్నారు. కుంభమేళాను ముగిస్తున్నట్టు ప్రకటించినందుకు అఖాడా పరిషత్‌కు క్షమాపణలు చెప్పాలని నిర్వాణి అనీ అఖాడా అధ్యక్షుడు మహంత్ ధర్మ్‌దాస్ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ సీఎం లేదంటే కుంభమేళా అధికారికి మాత్రమే కుంభమేళా ముగిసినట్టు ప్రకటించే అధికారం ఉందన్నారు.

ఈ నెల 27న కరోనా నిబంధనలకు అనుగుణంగానే షాహీ స్నాన్ నిర్వహిస్తామన్నారు. నిజానికి కుంభమేళా మూడు నెలలపాటు జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 30 వరకు నెల రోజులపాటు మాత్రమే నిర్వహించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ఉద్ధృతి కొనసాగుతుండడం, వందలాది మంది భక్తులు వైరస్ బారినపడుతుండడంతో కుంభమేళాను ఇప్పుడే ముగిస్తున్నట్టు నిరంజని అఖాడా శుక్రవారం నాడు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement