Saturday, April 20, 2024

కాసేపట్లో సోనియాతో దీదీ భేటీ..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీ ఉన్నారు.. నిన్న ప్రధాని మోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ..ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షురాుల సోనియాతో సమావేశం కానున్నారు. మిషన్ మోడీ ఉద్వాసనకు రంగం సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్న మమతా అందులో భాగంగానే ఇవాళ సోనియాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెగసస్‌ స్పైవేర్‌ ఆరోపణలు, పెట్రో ధరల పెంపు సహా కీలకాంశాలపై… పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చించే అవకాశముంది. పెగసస్‌ స్పైవేర్‌లో మమత పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ పేరుండడం.. దీన్ని కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు ట్వీట్ చేయడం తర్వాతి పరిణామాలు.. ఇరు పార్టీల మధ్య సఖ్యతను కనబరుస్తున్నాయి. మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ మారింది.

ఇది కూడా చదవండి : ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement