Thursday, April 25, 2024

కడుపుబ్బా నవిస్తున్న ‘జాతి రత్నాలు’ ట్రైలర్

సస్సెన్స్ థ్రిల్లర్‘ఏజెంట్ సాయి శ్రీనివాస’తో మెప్పించిన నవీన్ పొలిశెట్టి నటించిన నూతన చిత్రం ‘జాతి రత్నాలు’ ట్రైలర్‌ను గురువారం నాడు హీరో ప్రభాస్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ సినీ ప్రియులను కడుపుబ్బా నవ్విస్తోంది. అనుదీప్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టితో పాటు కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్నారు. రాధన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. మార్చి 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement